
ఫోన్ పోతే ఆందోళన వద్దు
● ఎస్పీ జానకీషర్మిల
నిర్మల్టౌన్: మొబైల్ ఫోన్ పోతే ఆందోళన చెందొద్దని, పోలీస్ స్టేషన్లో లేదా మీసేవ ద్వారా ఫిర్యాదు చేయాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. https://www.ceir.gov.in వెబ్పోర్టల్ ద్వారా ఫోన్ ఆచూకీ తెలుసుకోవడం చాలా సులభమన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న 70 మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ వెబ్సైట్ ద్వారా గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటిని జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మార్కెట్లో చౌకగా వస్తుందని సెకండ్హ్యాండ్ ఫోన్లు కొనే ముందు సీఈఐఆర్ వెబ్సైట్లో ఆ ఫోన్ ఐఎంఈఐ నంబర్ నమోదు చేసుకోవాలని సూచించారు. దొంగతనానికి లేదా ఫోన్లను వెతికి పెట్టడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం ఇప్పటికే పలు రకాల సాంకేతిక అంశాలను ఉపయోగిస్తుందని తెలిపారు. అ యితే టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొత్తగా ప్రవేశ పెట్టిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీరిజిస్టర్ (సీఈఐఆర్) అనే అప్లికేషన్ పోయిన ఫోన్ను వెతికి పెట్టడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ అప్లికేషన్ను సద్వినియోగించుకోవాలని తెలిపారు. ఈ వెబ్సైట్ ద్వారా ఇప్పటి వరకు పోయిన 1566 ఫోన్లు రికవరీ చేశామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఐటీ కోర్, వివిధ పోలీస్స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.