
వంద సీట్లు గెలుస్తాం
‘సరస్వతి’ నీళ్లు వచ్చేదెప్పుడు?
సరస్వతి కాలువ నుంచి సాగునీటి విడుదలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలే దు. దీంతో రైతులు వరి నాట్లు వేయాలా.. వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారు.
ఇక ఇంటర్లో ముఖగుర్తింపు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకుల హాజరుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఫేషియల్ రికగ్నిషన్ విధానంలో హాజరు నమోదుకు కసరత్తు చేస్తోంది.
9లోu
8లోu
నిర్మల్/ఖానాపూర్: సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజురోజుకూ ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో 100 సీట్లు గెలుచి మళ్లీ అధికారంలోకి వస్తామని, ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లాలో అన్ని సీట్లూ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తంజేశారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క తదితరులతో ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం జనహిత పాదయాత్ర ని ర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్కుమార్గౌడ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీలు రాష్ట్ర ప్రజల ను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన స్వల్పకాలంలోనే రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం లాంటి హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. తాము ఏసీల్లో కూర్చోకుండా తమ నేత రాహుల్గాంధీ చెప్పినట్లు ప్రజల్లో ఉండేందుకే జనహిత పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు. ఆదిలాబాద్ జిల్లాను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
ఆదివాసీలతో అనుబంధం ఉంది : మీనాక్షి
మళ్లీ తనకు జన్మంటూ ఉంటే ఆదివాసీగానే పుట్టాల ని కోరుకున్న దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఆశయాలు, ప్రజలతో ఎప్పుడూ దగ్గరగా ఉంటే వారి సమస్యలు ఎక్కువగా పరిష్కరించవచ్చన్న తమనేత రాహుల్గాంధీ ప్రేరణతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. తనకు ఆదివాసీలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్తోనూ అనుబంధం ఉందని పేర్కొన్నారు. గతంలోనూ సర్వోదయ యాత్రలో భాగంగా ఆదిలాబాద్కు వచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఆదివాసీ సమాజం నుంచి తాను మంచితనాన్ని నేర్చుకున్నట్లు చెప్పా రు. జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన ఆదివా సీలే తమకు స్ఫూర్తి అన్న రాహుల్గాంధీ ఆశయాలతోనే ముందుకు సాగుతామని చెప్పారు. ఉమ్మడి జి ల్లాలోని ఆదివాసీసులు, గిరిజనుల అభివృద్ధికి ము ఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హా మీలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నెరవేరుస్తున్నారని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. బనకచర్లపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోందని, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు.. మన నీళ్లను ఆంధ్రప్రదేశ్కు దోచిపెట్టారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు చిలుకపలుకులు పలుకుతున్నారని, గతంలో మూడు రాష్ట్రాలను ఇ చ్చి, తెలంగాణకు మొండిచేయి చూపారని ఆరోపించారు. తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు బీజేపీ, బీఆర్ఎస్కు లేదని విమర్శించారు. దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టే శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాపై ప్రభుత్వం ప్రత్యేకదృష్టి పెట్టిందని, అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామని చె ప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎలా దోపిడీ జరిగిందో, ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పని చేస్తోందో ప్రజలకు తెలు పుతూ.. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే జనహిత పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీకి పాల్పడితే, బీజేపీ ప్రజల్లో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా నూతన రేషన్కార్డులు ఇస్తూ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలి పారు. ‘స్థానిక’ ఎన్నికల్లో ఐక్యంగా ముందుకు సాగి అన్ని స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో జీవోలు మినమా పైసలు ఇవ్వలేదని, జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి ఎద్దేవా చేశారు. గత సీఎం కేసీఆర్కు ఎన్నిసార్లు విన్నవించినా సదర్మట్ మినీబ్యారేజీ నుంచి ప్రత్యేక కాలువ ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ మండిపడ్డారు.
నేటి కార్యక్రమాలు రద్దు
ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో జనహిత పాదయాత్ర కార్యక్రమం పూర్తయ్యాక ఆదివారం రాత్రి జేకే ఫంక్షన్ హాల్లో నైట్హాల్ట్, సోమవారం నిర్వహించనున్న శ్రమదానం తదితర కార్యక్రమాలు రద్దయినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఏఐసీసీ పిలుపులో భాగంగా ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి పార్టీ నాయకులు వెళ్లాల్సి ఉండగా కార్యక్రమాన్ని అర్ధంతరంగా రద్దు చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యక ర్తలు, అధికారులు ఖానాపూర్ నుంచి వారివారి ప్రాంతాలకు వెళ్లిపోయారు.

వంద సీట్లు గెలుస్తాం