
మందుల లెక్క పక్కాగా ఉండాలి
● రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మంజునాథ్
నిర్మల్చైన్గేట్: జిల్లా జనరల్ ఆసుపత్రితోపా టు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల లెక్క పక్కాగా ఉండాలని రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి మంజునాథ్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి, సెంట్రల్ డ్రగ్ స్టోర్, ముజ్గి, దిలావర్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందుల నిల్వలను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఆన్లైన్, ఆఫ్లైన్లో మందులను సరైన విధంగా నిర్వహించాలని సూచించారు. అవసరమైన మందులను ఎప్పటికప్పుడు ఇండెంట్ పెట్టి తెప్పించుకోవాలని తెలిపారు.