
నా కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి
నాడు ఇంద్రవెల్లిలో సంతకు నా భర్త శంభుతో కలిసి వెళ్లిన. అక్కడి నుంచే ఇద్దరం మీటింగ్కు వెళ్లినం. ఆ సందర్భంగా పోలీసుల కాల్పుల్లో నా కుడి చేయికి గాయమైంది. నా భర్తకు కూడా తుపాకీ బుల్లెట్ల గాయంతో ఇంటికొచ్చి కొద్ది రోజుల తరువాత చనిపోయిండు. చేతికి గాయం కారణంగా ఇప్పటికీ నేను ఏ పనిచేయలేకపోతున్న. ఉన్న ఒక్క కొడుకు కూడా అనారోగ్యంతో చనిపోయిండు. కోడలు వద్ద ఉంటున్న. పింఛన్ కూడా వస్తలేదు. ప్రభుత్వం గుర్తించి ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి. – మడావి జంగుబాయి, కన్నాపూర్ గ్రామస్తురాలు