అత్తను గొంతు నులిమి చంపిన కోడలు | Woman Attacked on his Mother in Law | Sakshi
Sakshi News home page

అత్తను గొంతు నులిమి చంపిన కోడలు

Sep 18 2026 1:33 PM | Updated on Sep 18 2026 1:38 PM

Woman Attacked on his Mother in Law

తమిళనాడు:  చెంగల్పట్టులోని పెరియనాధం మెట్టు వీధికి చెందిన పెరుందేవి (61). ఈమె తన కుమారుడు వెంకటేషన్‌ (34), కోడలు ఇందుజ (28), మనవడు, మనవరాలితో నివసిస్తుంది. ఈ స్థితిలో, గత ఆదివారం సాయంత్రం పెరుందేవి తన ఇంట్లోని బాత్రూంలో జారిపడి తీవ్రంగా గాయపడి, స్పృహ కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ఆమెను వెంటనే రక్షించి, తీవ్ర చికిత్స కోసం చెంగల్పట్టు ప్రభుత్వ వైద్య ఆసుపత్రిలో చేర్పించారు. ఈ స్థితిలో, సోమవారం పెరుందేవి విషాదకరంగా మరణించింది. చెంగల్పట్టు సిటీ పోలీస్‌ స్టేషన్‌లో సహజ మరణంగా కేసు నమోదు చేశారు.

దీని అనంతరం, పెరుందేవి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా, ఆమె గొంతు నులమడం వల్ల మరణించినట్లు వెల్లడైంది. అనుమానం వచ్చిన పోలీసులు ఆమె కోడలు ఇందుజను విచారించారు. విచారణలో ఇందుజ చెప్పిన దాని ప్రకారం, గత ఐదేళ్లుగా అత్తాకోడళ్లు  గొడవ పడుతు వచ్చారు.  తన అత్త అకస్మాత్తుగా బాత్రూంలో స్పృహ కోల్పోవడాన్ని అవకాశంగా తీసుకుని,  ఆమె గొంతు నొక్కి, కొట్టినట్లు తెలిపింది.  చెంగల్పట్టు నగర పోలీసులు ఆమెను అరెస్టు చేసి,  చెంగల్పట్టు క్రిమినల్‌ కోర్టులో హాజరుపరిచి, పుళల్‌ మహిళా జైలుకు తరలించారు.   

ఇదీ చదవండి: నా మాట ఎవరు వింటారు?

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement