అటార్నీ జనరల్‌గా ఆర్‌.వెంకటరమణి 

Senior Advocate R Venkataramani is new Attorney General for India - Sakshi

న్యూఢిల్లీ: భారత తదుపరి అటార్నీ జనరల్‌గా సీనియర్‌ న్యాయవాది ఆర్‌.వెంకటరమణి న్యాయ శాఖ మంత్రి కిరెణ్‌ రిజిజు ఈ మేరకు ట్వీట్‌ చేశారు. నియామకాన్ని నిర్ధారిస్తూ కేంద్ర న్యాయ శాఖ పరిధిలోని లీగల్‌ అఫైర్స్‌ విభాగం బుధవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ పదవిలో వెంకటరమణి మూడు సంవత్సరాలపాటు కొనసాగుతారు. ప్రస్తుత అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ పదవీకాలం ఈ నెల 30వ తేదీతో ముగియనుంది.

వేణుగోపాల్‌ స్థానంలో సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీని నియమించాలని గతంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే, సొంత కారణాలతో రోహత్గీ ఆ ప్రతిపాదనను ఇటీవల తిరస్కరించారు. వెంకటరమణి అక్టోబర్‌ ఒకటో తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు. మోదీ తొలిసారిగా ప్రధాని అయినపుడు 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకు రోహత్గీనే అటార్నీగా ఉన్నారు. ఆయన పదవీకాలం ముగిశాక వేణుగోపాల్‌ సేవలందించారు. 

చదవండి: (ఘోర రోడ్డు ప్రమాదం... 10 మంది దుర్మరణం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top