‘రెడ్‌ లైట్‌ ఆన్‌, గాడీ ఆఫ్’ ఉద్యమం | Red Light On Engine Off New Campaign For Controlling Air Pollution In Delhi | Sakshi
Sakshi News home page

‘రెడ్‌ లైట్‌ ఆన్‌, గాడీ ఆఫ్’

Oct 15 2020 1:11 PM | Updated on Oct 15 2020 1:54 PM

Red Light On Engine Off New Campaign For Controlling Air Pollution In Delhi - Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు కేజ్రివాల్‌ ప్రభుత్వం కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. గురువారం ‘రెడ్‌ లైట్‌ ఆన్‌, గాడీ ఆఫ్‌’  కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా ఢీల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్ మాట్లాడుతూ.. ‘‘వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు ‘రెడ్‌ లైట్‌ ఆన్‌, గాడీ ఆఫ్’ అనే ఉద్యమానికి శ్రీకారం చుట్టాము. ఢిల్లీలో దాదాపు ఒక కోటి వాహనాలు నమోదై ఉన్నాయి. ( అన్ని విధాలా సాయం అందిస్తాం )

ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ దగ్గర కనీసం 10 లక్షల వాహనాలు ఇంజన్స్‌ను ఆఫ్‌ చేస్తే.. ప్రతీ ఏటా 1.5 టన్నుల ‘పర్టిక్యులేట్‌ మ్యాటర్‌ 10’ తగ్గుతుంది. ఇందుకోసం మనమందరం ఈ రోజే ప్రతిన బూనాలి. సిగ్నల్స్‌ దగ్గర మీరు మీ వాహనాల ఇంజన్స్‌ను ఆఫ్‌ చేస్తే మీకు డబ్బులు ఆదా అవ్వటమే కాకుండా వాయు కాలుష్యం తగ్గుతుంద’’ని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement