సభ సజావుగా సాగేందుకు సహకరించాలి | Rajya Sabha Chairman calls meeting of floor leaders of all political parties | Sakshi
Sakshi News home page

సభ సజావుగా సాగేందుకు సహకరించాలి

Jul 18 2021 6:15 AM | Updated on Jul 18 2021 6:15 AM

Rajya Sabha Chairman calls meeting of floor leaders of all political parties - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒకరికొకరు సహకరించుకోవాలని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు కోరారు. శనివారం ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో వివిధ రాజకీయపక్షాల నేతలు తమ అభిప్రాయాలను చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్ళారు. కోవిడ్‌ వల్ల దేశంలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా ప్రజల పక్షాన నిలబడాలని,  సంబంధిత అంశాలపై చర్చించాలని వెంకయ్య నాయుడు  కోరారు. వర్షాకాల సమావేశాల్లో 6 ఆర్డినెన్స్‌లతో కలిపి మొత్తం 29 బిల్లులను సభ ముందు ఉంచుతున్నామని, సభ సజావుగా సాగేందుకు అన్ని పార్టీల సహకారాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి కోరారని సమాచారం.  ఈ సమావేశానికి రాజ్యసభ నాయకుడు పీయూష్‌ గోయల్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రైల్వే, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ సహా  పలువురు మంత్రులు హాజరయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement