డ్రీమ్‌ 11లో రూ.1.5 కోట్లు గెలుచుకున్న ఎస్‌ఐ సస్పెన్షన్.. ఎందుకంటే..? | Pune Cop Won Rs 1.5 Crore On Dream11 Sparks Inquiry | Sakshi
Sakshi News home page

డ్రీమ్‌ 11లో రూ.1.5 కోట్లు గెలుచుకున్న ఎస్‌ఐ సస్పెన్షన్.. ఎందుకంటే..?

Oct 19 2023 8:03 AM | Updated on Oct 19 2023 9:34 AM

Pune Cop Rs1.5 Crore Win On Dream11 Sparks Inquiry - Sakshi

ముంబయి: డ్రీమ్‌ 11లో రూ.1.5 కోట్ల రూపాయలు గెలుచుకున్న ఓ ఎస్‌ఐకి అధికారులు షాక్ ఇచ్చారు. పోలీసు విభాగం ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ సదరు ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు వేశారు. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన అధికారి ఆన్‌లైన్ గేమింగ్‌లో పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. 

మహారాష్ట్ర పింప్రి చించ్వాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌ఐ సోమనాథ్ ఆన్‌లైన్ గేమింగ్‌లో పాల్గొన్నారు. ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా ఆయన తనకున్న జ్ఞానంతో టీంను ఎంచుకుని డ్రీమ్‌ 11లో పాల్గొన్నారు. అదృష్టం కలిసివచ్చి రూ.1.5 గెలుచుకున్నారు. దీంతో ఆయన తన కుటుంబానికి మిఠాయిలు తినిపిస్తూ ఆనందంగా సంబరాలు చేసుకున్నారు. ఈ విషయం అధికారులు దృష్టికి వెళ్లడంతో విషయం పెద్దదైంది. 

ఆన్‌లైన్ గేమింగ్‌లో పాల్గొని పోలీసు శాఖ పరువు తీస్తున్నారంటూ ఉన్నతాధికారులు ఎస్‌ఐ సోమనాథ్‌పై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. ఈ వ్యవహారాన్ని స్థానిక డీసీపీకి అప్పగించారు. గత మూడు నెలలుగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లో ఎస్‌ఐ సోమనాథ్ పాల్గొంటున్నారని నిర్దారించారు. ఈ వ్యవహారంలో సోమనాథ్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో రూ.1.5 గెలుచుకున్న ఆనందం ఆవిరైపోయింది.    

ఇదీ చదవండి: బీజేపీ కీలక నిర్ణయం.. గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి నియామకం

Advertisement
 
Advertisement
Advertisement