సాక్షి,ఢిల్లీ: ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలను ప్రధాని మోదీ పరామర్శించారు. బుధవారం మధ్యాహ్నం భూటాన్ పర్యటన తర్వాత మోడీ ఢిల్లీ చేరుకున్నారు. భూటాన్ పర్యటన ముగించుకొని ఢిల్లీ వచ్చిన మోదీ పేలుడు ఘటనలో తీవ్రగాయాల పాలై లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ హాస్పిటల్(LNJP)లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. మృతుల కుటుంబాలతో భేటీ కానున్నారు. వారిని పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు.

సోమవారం (నవంబర్10) సాయంత్రం ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, పేలుడు తరువాత పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS),క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.

Went to LNJP Hospital and met those injured during the blast in Delhi. Praying for everyone’s quick recovery.
Those behind the conspiracy will be brought to justice! pic.twitter.com/HfgKs8yeVp— Narendra Modi (@narendramodi) November 12, 2025
‘ఢిల్లీలో విషాద సంఘటన జరిగింది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాల బాధను నేను అర్థం చేసుకోగలను’ అని మోదీ భూటాన్లోని థింఫు వేదికపై వ్యాఖ్యానించారు. ‘నేను బరువెక్కిన హృదయంతో ఇక్కడికి వచ్చాను. ఈ దుఃఖ సమయంలో దేశం మొత్తం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తోంది. పేలుడు ఘటనపై కేంద్ర భద్రతా సంస్థలు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగాయని ప్రధాని తెలిపారు. “ఈ దాడికి కారణమైన వారు ఎంతటివారైనా ఉపేక్షించబోము. వారిని తప్పకుండా న్యాయస్థానం ముందు నిలబెడతాం. కఠిన చర్యలు తీసుకుంటాం,” అని హెచ్చరించారు. బాధ్యులందరినీ న్యాయ స్థానం ముందు నిలబెడతామని సూచించారు.


