ఆస్పత్రిలో చేరిన కర్ణాటక మాజీ సీఎం

బెంగుళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ బెంగుళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చేరినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఆయన శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడతున్నట్లు వెల్లడించాయి.
ఆయన వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆయన శ్వాస సంబంధిత మిషన్ సాయంతో కాస్త హాయిగా శ్వాస తీసుకుంటున్నారని, త్వరితగతిన పూర్తిగా కోలుకుంటారని తెలిపింది. కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్ దగ్గరుండి మరీ మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
(చదవండి: ఏడాది వయసు కొడుకుతో ఈ రిక్షా నడుపుతున్న మహిళ: వీడియో వైరల్)