మంగల్‌వెడా బరిలో అజిత్‌ పవార్‌ కుమారుడు

Jayant Patil Says Parth Pawar May Contest Mangalvedha - Sakshi

ఎన్సీపీ చీఫ్‌ జయంత్‌ పాటిల్‌ వ్యాఖ్య

సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం పాలైన ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ కుమారుడు పార్థ్‌ పవార్‌ మరోసారి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. అందిన వివరాల మేరకు కొల్హపూర్‌ జిల్లా మంగల్‌వెడా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో పార్థ్‌ పవార్‌ను బరిలోకి దింపేందుకు ఎన్సీపీ పావులు కదుపుతోంది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌ కొల్హపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పడం విశేషం. దీన్నిబట్టి లోకసభ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయంతో రాజకీయాల్లో అంతగా క్రియశీలకంగా లేని పార్థ్‌ పవార్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలోకి దింపనున్నారని తెలుస్తోంది.

అయితే ఈ విషయంపై అధికారికంగా పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన వె లువడలేదు. అదేవిధంగా ఈ విషయంపై పార్థ్‌ పవార్‌తో కూడా ఎలాంటి చ ర్చలు జరగలేదని కూడా జయంత్‌ పాటిల్‌ పేర్కొన్నారు. ఈ విషయంపై తొం దర్లోనే పార్టీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైనా వెళితే వారి వెనుకాల ఈడీని పురమాయిస్తుందని ఎన్సీపీ నేత జయంత్‌ పాటిల్‌ ఆరోపించారు. బీజేపీ నుంచి ఎన్సీపీలోకి చేరిన  ఏక్‌నాథ్‌ ఖడ్సేకు ఈడీ ద్వారా నోటీసులు పంపించారని మండిపడ్డారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top