పాకిస్తాన్‌తో యుద్ధం.. ఆర్మీ అధికారుల మీడియా సమావేశం లైవ్‌ | Indian Army Media Live On Operation Sindoor | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌తో యుద్ధం.. ఆర్మీ అధికారుల మీడియా సమావేశం లైవ్‌

May 10 2025 11:01 AM | Updated on May 10 2025 11:53 AM

Indian Army Media Live On Operation Sindoor

సాక్షి, ఢిల్లీ: పాకిస్తాన్‌ రెచ్చగొట్టే చర్యలకు దిగింది. భారత్‌లోని 26 ప్రదేశాల్లో పాక్‌ దాడులకు తెగబడిందని ఆర్మీ అధికారులు తెలిపారు. పాక్‌ దాడులను భారత్‌ సమర్ధవంతంగా తిప్పికొట్టిందని స్పష్టం చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌పై విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్త సమావేశంగా మీడియా సమావేశం నిర్వహించింది. ఆపరేషన్‌ సిందూర్‌పై అధికారులు వివరాలను వెల్లడించారు. 

ఉద్రిక్తతలపై తాజా పరిస్థితులను కర్నల్‌ సోఫియా ఖురేషి వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాక్‌ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. దాడులతో ఉద్రిక్తతలు పెంచుతోంది. వాటిని భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. శ్రీనగర్‌, ఉధంపూర్‌, బటిండాలో దాడులు జరుపుతోంది. పలు చోట్ల పాఠశాలలు, వాయుసేన ఆసుపత్రులపై కూడా దాడులు చేస్తోంది. భుజ్‌, బటిండాలోని ఎయిర్‌స్టేషన్లలపై పాక్‌ దాడి చేసింది. లాంగ్‌ రేంజ్‌ క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్లతో పాకిస్తాన్‌ దాడులు చేస్తోంది. పాక్‌ దాడులను భారత్‌ ధీటుగా తిప్పి కొడుతోంది. పాకిస్తాన్‌ పశ్చిమ ప్రాంతంలో క్షిపణులతో దాడికి దిగింది. యుద్ధ విమానాలు, డ్రోన్లతో దాడులు చేస్తోంది.పాకిస్తాన్‌ మిస్సైల్స్‌ను భారత వాయుసేన తిప్పి కొట్టింది. పాక్‌ ఎయిర్‌బేస్‌లను గట్టిగా దెబ్బతీశాం. సోషల్‌ మీడియాలో పాక్‌ తప్పుడు ప్రచారం చేస్తోంది. పాక్‌ దాడులను పూర్తి స్థాయిలో తిప్పికొట్టాం. పాక్‌ దాడులు చేసిన ప్రతీచోటా భారత్‌ గట్టిగా ప్రతిఘటించింది. పాకిస్తాన్‌ హైస్పీడ్‌ మిస్సైల్‌ మోర్టార్‌లను ప్రయోగించిందన్నారు. 

 

 

వింగ్ కమాండర్ ఒమికా సింగ్‌ మాట్లాడుతూ.. పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలను కొనసాగిస్తోంది. డ్రోన్స్, లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఉపయోగిస్తుంది. పటాన్ కోట్ , ఉడంపూర్, బూజ్ ప్రాంతాలపై దాడికి దిగింది. పాకిస్తాన్ దాడులను తిప్పి కొట్టాం. భారత్ కేవలం పాకిస్తాన్ మిలిటరీ కేంద్రాలను టార్గెట్ చేసి దాడులు చేసింది. పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోంది. భారత్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లకు ఎలాంటి హాని జరగలేదు అని అన్నారు.

 

విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి మాట్లాడుతూ.. భారత్ ఎస్ 400 ధ్వంసం చేశారన్న వార్తలు అవాస్తవం. సిరాసా, సూరత్ ఘడ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్‌కు ఎలాంటి నష్టం జరగలేదు. పాకిస్తాన్ సామాన్య ప్రజలపై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఒక అధికారి చనిపోయారు’ అని తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement