కరోనా: మరోసారి 3 లక్షలకు దిగువన కేసులు.. కొత్తగా ఎన్నంటే | India: Corona Active Cases in Country Decline to 22 Lakh | Sakshi
Sakshi News home page

Corona Cases in India: ఒక్కరోజే 3 లక్షల మంది కోలుకున్నారు.. 19.59% ఎగబాకిన పాజిటివిటీ రేటు

Jan 27 2022 10:47 AM | Updated on Jan 27 2022 4:56 PM

India: Corona Active Cases in Country Decline to 22 Lakh - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత కొన్ని దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,86,384 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. వైరస్​తో నిన్న మరో 573 మంది మరణించారు. 3,06,357 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 19.59 శాతానికి చేరింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దీని ప్రకారం దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,03,71,500 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 4,91,700 మంది మరణించారు. అయితే దేశంలో ప్రస్తుతం 22,02,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు 3,76,77,328 మంది కరోనా నుంచి కోలుకున్నారు. భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది.  ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,63,84,39,207కు చేరింది.
చదవండి: మనిషి చర్మంపై ఒమిక్రాన్‌ ఎన్ని గంటలు సజీవంగా ఉంటుందో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement