భారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్‌ | India And Pakistan War Related Live Updates | Sakshi
Sakshi News home page

భారత్‌, పాక్‌ మధ్య యుద్ధం.. అప్‌డేట్స్‌

May 10 2025 7:05 AM | Updated on May 10 2025 11:18 PM

India And Pakistan War Related Live Updates

War Live Updates..

ఇండియా పాకిస్తాన్ DGMOల మధ్య చర్చలు

కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో చర్చిస్తున్న మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్

విక్రమ్ మిస్త్రి, విదేశాంగ శాఖ కార్యదర్శి

డీజీఎంఒల స్థాయిలో జరిగిన కాల్పుల విరమణ అవగాహనను ఉల్లంఘిస్తున్నారు

దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం

కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాకిస్తాన్ దే బాధ్యత

ఈ ఉల్లంఘన పై తగిన దర్యాప్తు జరపాలి

ఈ అతిక్రమణ నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి

సీజ్‌ఫైర్‌ ఇక లేనట్లే.. కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా

మళ్లీ పాక్ బరితెగించింది. ఒకవైపు కాల్పుల విరమణ అంటూనే మళ్లీ భారత్ పై కాల్పులకు తెగబడుతోంది. శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. మూడు గంటల్లోనే పాక్ కాల్పుల విరమణ అంశాన్ని పక్కన పెట్టింది. జమ్మూ కశ్మీర్ లో మళ్లీ భారీ శబ్దాలు వినబడుతున్నాయంటూ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేయడంతో పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించిన విషయం బహిర్గతమైంది.  కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ ఆర్మీ ధిక్కరించినట్లు కనబడుతోంది. 

  • పాక్‌ కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ ఎస్‌ఐ ఇంతియాజ్‌ వీర మరణం
  • మళ్లీ వక్రబుద్ధిని చూపించిన పాకిస్తాన్‌

 

  • సరిహద్దు నగరాలపై పాక్ మళ్లీ కాల్పులు
  • డ్రోన్లు కనిపిస్తే కూల్చేయాలని బీఎస్ఎఫ్ కు ఆదేశాలు

జమ్మూ కశ్మీర్‌ లో  ఏం జరుగుతోందంటూ సీఎం  ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌

  • మళ్లీ కాల్పుల శబ్దాలు వినబడుతున్నాయి
  • భారీ శబ్దాలు వినపడుతున్నాయని ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌
  • శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు
  • పాక్‌ కాల్పుల నేపథ్యంలో శ్రీనగర్ లో బ్లాక్‌ అవుట్‌
  • 3 గంట్లల్లోనే పాక్‌ కాల్పుల  విరమణ ఒప్పందం ఉల్లంఘన
  • భారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్‌
  • శ్రీనగర్ లో నాలుగు ప్రాంతాల్లో కాల్పుల శబ్దాలు
  • అఖ్నూర్‌,  రాజౌరి, పూంచ్‌ సెక్టార్‌  లో కాల్పులు
  • పాక్‌ కాల్పులను తిప్పికొడుతున్న భారత సైన్యం
  • రాజస్థాన్‌ సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాల్లో బ్లాక్‌ అవుట్‌
  • జమ్మూ కశ్మీర్‌ లో పలు ప్రాంతాల్లో బ్లాక్‌ అవుట్‌


 

 

 

భారత్‌-పాక్‌  కాల్పుల విరమణను ధృవీకరించిన భారత్‌

  • అధికారికంగా ప్రకటించిన విదేశాంగ శాఖ  కార్యదర్శి  విక్రమ్‌ మిస్రీ
  • అమల్లోకి భారత్‌-పాక్‌  కాల్పుల విరమణ ఒప్పందం
  • సాయంత్రం 5 గంటల నుంచే అమలు: విక్రమ్‌ మిస్రీ

భారత్‌, పాక్‌ల యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన

  • ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి
  • భారత్‌, పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ ట్వీట్‌
  •  ఇరు దేశాలతో సుదీర్ఘంగా  రాత్రంతా చర్చించా
  • ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి
  • ఇరు దేశాలకు కంగ్రాట్స్‌

 

 

 

 బెంగళూరు నుంచి కళ్లి తండాకు  మురళీ నాయక్‌ పార్థివదేహం

పాకిస్తాన్‌ తో యుధ్ధంలో వీర మరణం పొందిన భారత జవాన్‌ మురళీ నాయక్‌ పార్థివదేహం  బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. అక్కడ ఆ వీర జవాన్‌కు ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం ఆ జవాన్‌ పార్థివదేహాన్ని శ్రీసత్యసాయి జిల్లాలోని కళ్లితండా తరలిస్తున్నారు. రేపు(ఆదివారం) సైనిక లాంఛనాలతో వీర మరణం పొందిన ఆ జవాన్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

 

మరో జవాన్ వీరమరణం

  • పాక్ కాల్పుల్లో మరో జవాన్ 'సచిన్ యాదవ్‌రావు వనాంజే' (29) వీరమరణం పొందారు. ఈయన స్వగ్రామం మహారాష్ట్ర - తెలంగాణ బార్డర్‌లోని నాందేడ్ జిల్లాలోని తమ్లూర్.

సైరన్ల శబ్దాలు వాడొద్దు.. మీడియా ఛానెళ్లకు కేంద్రం సూచన

  • సైరన్ల సౌండ్‌లతో.. వాస్తవ సైరన్లను ప్రజలు తేలికగా తీసుకునే ప్రమాదం ఉంది
  • కేవలం అవగాహన కార్యక్రమాల్లోనే వినియోగించాలి
     

ఢిల్లీ :

32 విమానాశ్రయాలు మూసివేత

9 మే 2025 నుండి 14 మే 2025 వరకు (15 మే 2025న 0529 IST వరకు) ఆపరేషనల్ కారణాల వల్ల తాత్కాలికంగా నిలిపివేత

భారత విమానాశ్రయాల అథారిటీ (AAI) సంబంధిత విమానయాన అధికారులు జారీ చేసిన ఎయిర్‌మెన్‌కు సూచనల (NOTAMs) వివరాలు 
    1    తాత్కాలిక విమానాశ్రయ మూసివేత:
    ◦    ప్రభావిత విమానాశ్రయాల జాబితా:
    ▪    అధంపూర్
    ▪    అంబాలా
    ▪    అమృత్‌సర్
    ▪    అవంతీపూర్
    ▪    బఠిండా
    ▪    భుజ్
    ▪    బికనీర్
    ▪    చండీగఢ్
    ▪    హల్వారా
    ▪    హిండన్
    ▪    జైసల్మీర్
    ▪    జమ్మూ
    ▪    జామ్‌నగర్
    ▪    జోధ్‌పూర్
    ▪    కాండ్లా
    ▪    కాంగ్రా (గగ్గల్)
    ▪    కేశోద్
    ▪    కిషన్‌గఢ్
    ▪    కుల్లూ మనాలి (భుంటర్)
    ▪    లేహ్
    ▪    లూధియానా
    ▪    ముంద్రా
    ▪    నలియా
    ▪    పఠాన్‌కోట్
    ▪    పటియాలా
    ▪    పోర్‌బందర్
    ▪    రాజ్‌కోట్ (హిరాసర్)
    ▪    సర్సావా
    ▪    షిమ్లా
    ▪    శ్రీనగర్
    ▪    థోయిస్
    ▪    ఉత్తర్లై
    ◦    ఈ కాలంలో ఈ విమానాశ్రయాలలో అన్ని పౌర విమాన కార్యకలాపాలు నిలిపివేయబడతాయి.
   

ఆపరేషన్‌ సిందూర్‌.. ఐదుగురు టాప్‌ ఉగ్రవాదులు హతం

  • 26/11 దాడులకు ప్రతీకారం తీర్చుకున్న భారత్‌.
  • ముంబై దాడి సూత్రధారిని మట్టుబెట్టిన భారత్‌.
  • ఉగ్రస్థావరాలపై దాడిలో అబు జిందాల్‌ మృతి
  • ఐదుగురు టాప్‌ ఉగ్రవాదులను హతమార్చిన భారత్‌.
  • ఆపరేషన్‌ సిందూర్‌ దాడుల్లో భాగంగా ఐదుగురు టాప్‌-5 టెర్రరిస్టులు హతం.
  • ముగ్గురు జైషే ఉగ్రవాదులు, ఇద్దరు లష్కర్‌ ఉగ్రవాదులు హతం.
  • మురిద్కే, బహవల్‌పూర్‌లో జరిగిన దాడిలో ఉగ్రనేతలు మృతి,
  • మురిద్కే దాడిలో అబు జుందాల్‌ హతం.
  • అబు అంత్యక్రియలకు హాజరైన పాక్‌ ఆర్మీ చీప్‌ మునీర్‌.
  • జైషీ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ బావమరిది హఫీజ్‌ మహమ్మద్‌ జమీల్‌ హతం
  • లష్కరే ఉగ్రనాయకుడు మహమ్మద్‌ యూసుఫ్‌ అజార్‌ హతం. 
  • కాందహార్‌ హైజాక్‌ కీలక సూత్రధారి మహమ్మద్‌ యూసఫ్‌
  •  ఇవి మే 7వ తేదీ(బుధవారం అర్థరాత్రి) భారత్‌ మట్టుబెట్టిన ఉగ్రవాదులు వివరాలు
     

మోదీ హైలెవల్‌ మీటింగ్‌

  • త్రివిధ దళాల అధిపతులతో మోదీ హైలెవల్‌ మీటింగ్‌
  • ప్రధాని నివాసంలో కొనసాగుతున్న ఉన్నత స్థాయి సమావేశం
  • భేటీలో పాల్గొన్న చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

 

దాదాపు గంటన్నర పాటు మోదీ-దోవల్‌ భేటీ..

  • పాకిస్తాన్‌ దాడులు, భారత్‌ కౌంటర్‌పై చర్చ.
  • దాదాపు గంటన్నర పాటు మోదీ-దోవల్‌ భేటీ
  • త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీ
  • రాజ్‌నాథ్‌ భేటీలో పాల్గొన్న ఎన్‌ఎస్‌ఏ ధోవల్‌.
  • సరిహద్దుల్లో ఉద్రికత్తలపై గంటకుపైగా చర్చ. 

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టు వద్ద భారీ పేలుళ్లు..

  • శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ పేలుళ్లు
  • ఉదయం 11.45 గంటల సమయంలో పేలుడు శబ్దాలు వినిపించినట్లు అధికారుల వెల్లడి
  • కొన్ని ప్రాంతాల్లో మోగిన సైరన్లు.. పేలుడు శబ్దాలతో వణికిపోయిన ప్రజలు
  • శనివారం తెల్లవారుజామున కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించిన అధికారులు
     

పాక్‌కు భారీ నష్టం..

  • పాకిస్తాన్‌పై విరుచుకుపడుతున్న భారత వైమానిక దళం.
  • చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాక్‌పై దాడులు
  • రెండు రోజులుగా పాక్‌లోని ప్రధాన నగరాలపై వాయుసేన దాడులు
  • భారత వైమానిక దాడుల్లో లాహోర్‌, రావల్పిండి, సియాల్‌కోట్‌, పెషావర్‌, ఇస్లామాబాద్‌లో భారీ నష్టం.
  • నూర్‌ఖాన్‌, ముర్షీద్‌, రఫికీ ఎయిర్‌బేస్‌లపై దాడి.
  • నాలుగు పాక్‌ ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసిన భారత్‌.
  • భారత్‌ దాడులతో పాక్‌ ప్రజలు నగరాలు వదిలేసి వెళ్లిపోతున్నారు.
  • కరాచీలోనూ భయంతో పాక్‌ ప్రజలు తరలి వెళ్తున్నారు.
  • ఇస్లామాబాద్‌లో ఇప్పటికే పెట్రోల్‌ బంక్‌లు బంద్‌.
  • పాకిస్తాన్‌లో ఎయిర్‌పోర్టులన్నీ షట్‌డౌన్‌.
  • సియోల్‌కోట్‌లో మరో ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేసిన భారత్‌. 

అజిత్‌ దోవల్‌ భేటీ.. 

  • కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్న అజిత్‌ దోవల్‌. 
  • సరిహద్దుల్లో పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించనున్న దోవల్‌.
  • ఇంతకుముందే త్రివిధ దళాలతో భేటీ అయిన దోవల్‌. 

ఢిల్లీ..

  • రక్షణశాఖ కార్యాలయంలో కీలక సమావేశం.
  • ౌసౌత్‌ బ్లాక్‌లో సమావేశమైన త్రివిధ దళాధిపతులు.
  • మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సమావేశమైన త్రివిధ దళాధిపతులు.
  • పాకిస్తాన్‌ దాడులపై తీసుకోవాల్సిన చర్యలపై చర్యలు
  • ఉదయం 10:30 గంటకు విదేశాంగ శాఖ మీడియా సమావేశం.  
  • ఆపరేషన్‌ సిందూర్‌పై వివరాలు వెల్లడించనున్న అధికారులు.

పంజాబ్‌ భటిండాలో రెడ్‌ అలర్ట్‌

  • ప్రజలు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ.
  • జమ్ము కశ్మీర్‌లో కొనసాగుతున్న పాకిస్తాన్‌ కాల్పులు.
  • రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్న పాకిస్తాన్‌ ఆర్మీ.

అమృత్‌సర్‌లో రెడ్‌ అలర్ట్‌..

  • భారత్‌, పాకిస్తాన్‌ దాడుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం.
  • భారీగా భద్రతా దళాల మోహరింపు.
  • ప్రజలు అ‍ప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ.
  • ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచనలు చేసిన అధికారులు.
  • జమ్ము, రాజస్థాన్‌, పంజాబ్‌లో జనావాసాలపై పాక్‌ దాడులు.
  • జానీపూర్‌ నివాస ప్రాంతంలో పాక్‌ మిస్సైల్‌ దాడులు. 
     

పౌరులు, ఆలయాలే టార్గెట్‌గా పాకిస్తాన్‌ దాడులు.. 

  • పాక్ మిలిటరీ పోస్ట్‌.. టెర్రర్‌ లాంఛ్‌ప్యాడ్‌ ధ్వంసం
  • సరిహద్దుల్లో ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితులు
  • నియంత్రణ రేఖకు ఆవల పాకిస్తాన్‌ పోస్టుల నుంచి డ్రోన్లు ప్రయోగిస్తున్న దాయాది.
  • ఆ పోస్టులను ధ్వంసం చేసిన భారత ఆర్మీ
  • పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పాకిస్తాన్‌ క్షిపణి శకలాలు లభ్యం
  • జమ్మూలోని శంభూ ఆలయం సమీపంలోనూ క్షిపణి శకలాలు లభ్యం
  • పౌరులు, ఆలయాలే టార్గెట్‌గా పాకిస్తాన్‌ దాడులు. 

 

 

 

 

 

పాక్‌కు చుక్కలే..

  • పాక్‌ దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది.
  • పాక్‌ డ్రోన్లను, మిస్సైల్స్‌ను కూల్చివేసిన భారత్‌. 

 

నేడు భారత సైన్యం మీడియా సమావేశం.

  • నేటి ఉదయం 10 గంటలకు భారత సైన్యం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
  • ఆపరేషన్‌ సిందూర్‌ 2.0పై ప్రకటన చేసే అవకాశం ఉంది. 

భారత్‌ దాడులు తీవ్రతరం..

  • లాహోర్‌, ఇస్లామాబాద్‌ టార్గెట్‌గా భారత్‌ దాడులు. 

  • మూడు పాకిస్తాన్‌ ఎయిర్‌బేస్‌ల్లో పేలుళ్ల శబ్దాలు
  • శనివారం తెల్లవారుజామున పాక్‌లోని పలు వైమానిక స్థావరాల్లో శక్తిమంతమైన పేలుళ్లు.
  • వీటిల్లో ఇస్లామాబాద్‌ సమీపంలో ఉన్న కీలక స్థావరం
  • రెండు పాకిస్థాన్‌ ఫైటర్‌ జెట్ల కూల్చివేత
  • శ్రీనగర్‌ బేస్‌ నుంచి క్షిపణులను ప్రయోగించి కూల్చివేసిన భారత్‌
  • పఠాన్‌కోట్‌లో పేలుళ్ల శబ్దాలు
  • శనివారం తెల్లవారుజామున 5 గంటలకు వినిపించిన శబ్దాలు
  • శ్రీనగర్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు
  • ఆకాష్‌ జెట్‌తో పాక్‌ క్షిపణులను కూల్చివేసిన భారత్‌. 

 

పాకిస్తాన్‌ డ్రోన్‌ దాడులకు భారత్‌ ప్రతీకార దాడులు.

  • పాకిస్తాన్‌ ఎయిర్‌ స్పేస్‌ మూసివేత. పాక్‌ ఎయిర్‌స్పేస్‌లో విమానాల రాకపోకలు నిలిపివేత.

  • పాకిస్తాన్‌లోని మూడు ఎయిర్‌ బేస్‌లపై భారత్ దాడులు చేసింది. లాహోర్‌, రావాల్పిండి, పెషావర్‌లపై దాడి చేసింది. 

  • నూర్‌ఖాన్‌, మురీద్‌, రఫికి ఎయిర్‌ బేస్‌లపై దాడులు చేసిన భారత్‌. డ్రోన్స్‌, మిస్సైల్స్‌తో పాకిస్తాన్‌ ఎయిర్‌ బేస్‌లపై దాడి చేసిన భారత్‌.

  • నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌ సమీపంలో రెండు పేలుళ్లు సంభవించాయి. అటు, లాహోర్‌, రావల్పిండి, ఇస్లామాబాద్‌లో వరుస పేలుళ్లు.

  • భారత్‌ వ్యూహ్మాతక సైనిక శిబిరాలే లక్ష్యంగా పాకిస్తాన్‌ దాడులను తెగబడింది.

  • జమ్ము,శ్రీనగర్‌, అమృత్‌సర్‌లను టార్గెట్‌ చేసిన పాకిస్తాన్‌.

  • భారత్‌లోని 26 ప్రదేశాలు లక్ష్యంగా పాకిస్తాన్‌ డ్రోన్‌ దాడులు.

  • మిస్సైల్స్‌ ద్వారా పాక్‌ దాడులను అడ్డుకున్న భారత్‌.

  • ఫతా వన్‌ మిస్సైల్‌ను ధ్వంసం చేసిన భారత్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టం.

 

టార్గెట్‌ పఠాన్‌కోట్‌..

  • పఠాన్‌కోట్‌ను టార్గెట్‌ చేసిన పాకిస్తాన్‌.
  • రెండు పాక్‌ యుద్ధ విమానాలను కూల్చివేసిన భారత్‌.
  • అన్నిచోట్ల పాక్‌ దాడులను తిప్పి కొట్టిన భారత సైన్యం.
  • భారత్‌ దెబ్బతో పాకిస్తాన్‌ ఎయిర్‌బేస్‌ బంద్‌.. అన్ని విమానాలను రద్దు చేసిన పాక్‌.
  • శ్రీనగర్‌ టార్గెట్‌గా పాకిస్తాన్‌ ాదాడులు.
  • శ్రీనగర్‌లోని రెండు ప్రాంతాల్లో భారీ పేలుడు. 

 

పాక్‌ డ్రోన్లు దాడులు.. 
సరిహద్దు ప్రాంతాలపై పాక్‌ దాడులు వరుసగా కొనసాగుతున్నాయి. చీకట్లు పడుతూనే జమ్ము కశ్మీర్‌ మొదలుకుని రాజస్తాన్‌ దాకా 26కు పైగా ప్రాంతాల్లో దాయాది మరోసారి క్షిపణి, డ్రోన్‌ దాడులకు దిగింది.

కశ్మీర్‌లోని ఉరి, సాంబా, నౌగావ్, పూంఛ్, జమ్మూ, ఉధంపూర్, నగ్రోటా, రాజౌరీ, పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, అమృత్‌సర్, రాజస్తాన్‌లోని జైసల్మేర్, ఫోక్రాన్‌ తదితర ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. అక్కడి పౌర ఆవాసాలతో పాటు సైనిక స్థావరాలను పాక్‌ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి.

దాడులను సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. వాటిని ఎక్కడివక్కడ కూల్చేస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో  సరిహద్దు రాష్ట్రాలన్నింటా అప్రమత్తత పాటిస్తున్నారు. ముందు జాగ్రత్తగా బ్లాకౌట్‌ కొనసాగుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో శ్రీనగర్‌ మొదలుకుని జోద్‌పూర్‌ దాకా పలు పట్టణాల్లో చీకట్లు కమ్ముకున్నాయి.

మరోవైపు సరిహద్దుల పొడవునా పాక్‌ భారీగా కాల్పులకు తెగబడుతోంది. జమ్మూలోని రాంగఢ్, సుచేత్‌గఢ్‌ మొదలుకుని రాజస్తాన్‌లోని గంగానగర్‌ దాకా పలు ప్రాంతాలు కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలు సరిహద్దు జిల్లాలకు రెడ్‌ అలర్టులు జారీ చేశారు.

పేలుళ్లు, సైరన్లు 
శుక్రవారం అర్ధరాత్రి దాకా సరిహద్దుల పొడవునా పదులకొద్దీ పాక్‌ డ్రోన్లను సైన్యం కూల్చేసింది. మంటల్లో కాలుతూ కూలిపోతున్న డ్రోన్లతో ఆకాశం ప్రకాశమానంగా మారింది. అంతకుముందు శ్రీనగర్‌ విమానాశ్రయం, దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపురా వైమానిక బేస్‌పై డ్రోన్‌ దాడులకు పాక్‌ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టింది. అంతకుముందు జమ్మూతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు విని్పంచాయి. సైరన్లు మోగాయి.

పాక్‌ కాల్పులకు ఒక మహిళ బలవగా 18 మందికి పైగా గాయపడ్డారు. లైట్లు ఆర్పేయాల్సిందిగా స్థానిక మసీదుల్లోని లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. తన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బాంబులు, కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయంటూ జమ్మూ కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

బారాముల్లా, కుప్వారా, బందీపురా వంటి సరిహద్దు జిల్లాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలు, బంకర్లకు తరలిస్తున్నారు. దాడులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సరిహద్దుల వెంబడి మరిన్ని ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను సైన్యం యుద్ధ ప్రాతిపదికన మోహరిస్తోంది. ఓవైపు దాడులకు తెగబడుతూనే, మరోవైపు భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించాలంటూ ఇరాన్, సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్‌ దేశాలను పాక్‌ ప్రాధేయపడుతోంది. పాక్‌తో యుద్ధ పరిస్థితి నెలకొని ఉందని అమెరికాలో భారత రాయబారి వినయ్‌ క్వాట్రా అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement