మహారాష్ట్ర తొలి మహిళా సీఎస్‌గా సుజాతా సౌనిక్‌ రికార్డు | IAS Officer Sujata Saunik Becomes Maharashtra First Female Chief Secretary, See Details | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర తొలి మహిళా సీఎస్‌గా సుజాతా సౌనిక్‌ రికార్డు

Jul 1 2024 5:15 AM | Updated on Jul 1 2024 11:23 AM

IAS officer Sujata Saunik becomes Maharashtra first female Chief Secretary

ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి సుజాతా సౌనిక్‌ నియమితులయ్యారు. ఐఏఎస్‌ అధికారి నితిన్‌ కరీర్‌ పదవీ విరమణ అనంతరం సుజాతా సౌనిక్‌కు బాధ్యతలు అప్పగించారు. 

దక్షిణ ముంబైలోని రాష్ట్ర సచివాలయం మంత్రాలయంలో ఆదివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో సౌనిక్‌ బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్ర చరిత్రలో అత్యున్నత పదవిని చేపట్టిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. 1987 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన సుజాత మరో ఏడాది పాటు పదవిలో ఉంటారు. ఆమె భర్త మనోజ్‌ సౌనిక్‌ కొన్నేళ్ల క్రితం ప్రధాన కార్యదర్శిగా చేశారు. ఇప్పుడు రాష్ట్ర హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement