12 శాతానికి లోటు!
న్యూఢిల్లీ: జూలై మొదటి వారంలో దేశవ్యాప్తంగా అంచనాలకు మించి భారీ వర్షాలు నమోదు కావడంతో ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. తాజా వర్షాలతో లోటు కాస్తా 12 శాతానికి తగ్గిపోయిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రుతుపవనాల పురోగతి, ఎల్–నినో పరిస్థితులపై ప్రధానమంత్రి ప్రధాన సలహాదారు పి.కె.మిశ్రా మంగళవారం విస్తృత సమీక్ష నిర్వహించారు.
వ్యవసాయ, తాగునీరు, పారిశుద్ధ్యం, వాణిజ్య వ్యవహారాలు, ఆరోగ్యం కుటుంబ సంక్షేమ, జలవనరుల శాఖల అధికారులు పాల్గొన్న ఈ సమీక్ష సమావేశంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) జూన్, జూలై నెలల్లో దేశవ్యాప్తంగా రుతుపవనాల పరిస్థితి, ప్రభావాల గురించి వివరించింది.
గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, మహారాష్ట్రల్లో రుతుపవనాల రాక సాధారణం కంటే పది రోజులు ఆలస్యమైనప్పటికీ జూలై ఏడవ తేదీ వరకూ 30 శాతం వర్షం అధికంగా పడిందని, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. అయితే.. ఎల్–నినో పరిస్థితులు అన్నిసార్లూ వార్షభావానికి కారణం కాదని స్పష్టం చేసింది. పరిస్థితిని నిత్యం గమనిస్తూ ఉన్నామని తెలిపింది.
ఖరీఫ్ సీజన్లో ఎల్ నినో పరిస్థితులను తట్టుకునేందుకు ఎలాంటి చర్యలు తీసు కున్నారో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి వివరించారు. రాష్ట్రాలతోపాటు పంటలు, వాతావరణ శాఖలతో వారం వారం సమావేశాలు నిర్వహిస్తున్నామని, వర్షపా తం, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, వ్యవ సాయ పనులు, మార్కెట్ ధోరణలు, పంటలను ఆశిస్తున్న చీడపీడల పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు తెలి పారు.
సమస్యాత్మకం కాగల 262 జిల్లాల్లో ప్రత్యామ్నాయ ప్రణాళికలను అందుబా టులో ఉంచామని చెప్పారు. ఎల్–నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రామాణిక పద్ధతులు కొన్నింటిని సిద్ధం చేసిందని వివరించారు. అనానుకూల వాతావరణాన్ని తట్టుకోగల విత్తన వెరైటీలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
పాడిపశువులకు దాణ లభ్యతను పరిశీలిస్తున్నామని పశు సంవర్ధక శాఖ అధికారులు తెలపగా.. రిజర్వాయర్లు, భూగర్భ జలాల పరిస్థితిని నిత్యం గమనిస్తున్నామని జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. వడగాడ్పుల వంటి పరిస్థితులు ఏర్పడితే ఏం చేయాలన్నదానిపై సూచనలను సిద్ధం చేశామని ఆరోగ్య శాఖ వివరించింది. బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలు, ఖరీఫ్, రబీ సీజన్లకు తగినన్ని ఎరువులు అందుబాటులో ఉన్నాయని వాణిజ్య వ్యవహారాలు, ఎరువుల శాఖ తెలిపింది. వికసిత్ భారత్ పథకం కింద జూలై ఒకటవ తేదీ కింద చేపట్టిన పనులను గ్రామీణాభివృద్ధి శాఖ వివరించింది.


