
సాక్షి, తుమకూరు(కర్ణాటక): వినాయక చవితి సందోహం తిరిగివచ్చింది. తుమకూరు నగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన గోళూరు మహా గణపతి నిమజ్జనం వైభవోపేతంగా నిర్వహించారు. బలి పాఢ్యమి రోజును గణపతి ఆలయంలో వినాయక ప్రతిమను ప్రతిష్టించి ఇప్పటివరకు నిత్యపూజలు చేశారు.
కార్తీక మాసమంతా విఘ్నాధిపతికి నైవేద్యాలను సమర్పించారు. ఆదివారం వేలాది మంది భక్తుల సమక్షంలో ఊరేగింపుగా నిమజ్జన యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కళాబృందాల ప్రదర్శనలు రంజింపజేశాయి. చెరువులో జలార్పణం గావించారు.