ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో ప్రధాన న్యాయముర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారం చేశారు. ఆ కార్యక్రమం అనంతరం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ అధికారిక వాహనంలో కాకుండా సాధారణ వ్యక్తులలా ప్రైవేట్ వాహనంలో ఇంటికి వెళ్లారు. ఎందుకని వారిని ప్రశ్నించగా నుతన సీజేఐ మెుదటి రోజు నుంచే అధికారిక వాహనంలో వెళ్లాలని ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
"నేను ప్రమాణస్వీకారం చేసిన రోజే చెప్పాను. పదవీ విరమణ తర్వాత ఏ అధికారిక హోదాను అనుభవించనని, తరువాతి తొమ్మిది,10 రోజులు కొంత ప్రశాంతంగా గడుపుతా, అనంతరం నా కొత్త ఇన్నింగ్స్ మెుదవవుతుంది" అని గవాయ్ అన్నారు. తాను దళితుడైనప్పటికీ ఎస్సీ, ఎస్టీ కులాలలో క్రిమిలేయర్ ఉండాలన్న తన అభిప్రాయాన్ని గవాయ్ మరోసారి సమర్థించుకున్నారు.
రిజర్వేషన్ల ఫలితం ప్రతిసారి ఒకరికే అందుతుంటే వారే అభివృద్ధి చెందుతారు. గ్రామంలో పని చేసుకునే ఒక కార్మికుడి కుమారుడు, ఐఏఎస్, ఐపీఎస్ ల కుమారులతో పోటీపడగలరా ఇది సమానత్వ వేదిక అవుతుందా అని గవాయ్ ప్రశ్నించారు. అందుకే రిజర్వేషన్లు వాటి అవసరమున్న కుటుంబాలకే చేరాలన్నారు.
రాష్ట్రపతి భవన్లో జరిగిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుర్యకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులతో పాటు ప్రధాని మోదీ పాల్గొన్నారు.


