పిలుపునిచ్చిన రైతులు

Farmers Call For Bharat Bandh On December 8th - Sakshi

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ప్రభుత్వానికి రైతులకు మధ్య చర్చలు జరుగుతున్నా అవి ఫలితాన్నివ్వటం లేదు. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి గురైన రైతులు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. డిసెంబర్‌ 8వ తేదీన దేశ వ్యాప్త బంద్‌ పాటించాలని నిర్ణయించారు. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే అన్ని రహదారులను మూసేస్తామని ప్రకటించారు. (కెనడా ప్రధాని వ్యాఖ్యలు: భారత్‌ హెచ్చరిక!)

దేశ వ్యాప్తంగా ఉన్న టోల్‌గేట్లను స్వాధీనపర్చుకుని టోల్‌ గేట్‌ ఫీజులు వసూలు చేసుకోకుండా అడ్డుకుంటామని చెప్పారు. ‘‘ ఈ ఉద్యమంలో మరికొంత మంది చేరతారు. విద్యుత్‌ ఛార్జీలు, పంట నష్టం విషయంలో ప్రభుత్వం మా డిమాండ్లను ఒప్పుకుంటుందో లేదో చూడాలి’’ అని నిరసనలు తెలుపుతున్న ఓ రైతు సంఘం నాయకుడు హరిందర్‌ సింగ్‌ లోఖోవాల్‌ అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top