కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశే..! | Delhi Liquor scam: Court Extends Cm Arvind Kejriwal custody | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ పాలసీ కేసు.. కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశే..!

Sep 11 2024 6:41 PM | Updated on Sep 11 2024 7:27 PM

Delhi Liquor scam: Court Extends Cm Arvind Kejriwal custody

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ఆయన జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది. ఈ నెల 25 వరకు కేజ్రీవాల్‌ కస్టడీని పొడిగిస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. 

అంతకముందు విధించిన క స్టడీ నేటితో ముగియడంతో తీహార్‌ జైలు అధికారులు కేజ్రీవాల్‌ను నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. వాదనల అనంతరం రౌస్‌ అవెన్యూ కోర్టు స్పెషల్‌ జడ్జి కావేరీ బవేజా కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగిస్తున్నట్లు  వెల్లడించారు. ఇకఇదే కేసులో ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

కాగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత జూలైలో సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుంది. అయితే ఈడీ కేసులో సుప్రీంకోర్టు జూలై 12న కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ కేసులో మాత్రం ఇంకా జైల్లోనే కొనసాగుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే మనీశ్‌ సిసోడియా, కల్వకుంట్ల కవిత తదితరులు బెయిల్‌పై బయటకి వచ్చారు.


 

Advertisement
 
Advertisement
Advertisement