భారత్‌లో హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చేసిందా?  | Corona Virus: Has India Reached Any Closer To Herd Immunity | Sakshi
Sakshi News home page

భారత్‌లో హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చేసిందా? 

Nov 22 2020 7:59 AM | Updated on Nov 22 2020 10:17 AM

Corona Virus: Has India Reached Any Closer To Herd Immunity - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌లో పలు ప్రాంతాల్లో ఇప్పటికే నిర్వహించిన సెరో సర్వేల ద్వారా చాలామందిలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు స్పష్టమైంది. కొన్ని ప్రాంతాల్లో 60–70 శాతం యాంటీబాడీలు ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్, పుణేల్లో ప్రతి ఇద్దరిలో ఒకరికి కోవిడ్‌–19 కారక వైరస్‌ను అడ్డుకునే యాంటీబాడీలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని ప్రజలు ఇటీవలే కరోనా బారిన పడ్డవారు. కానీ హెర్డ్‌ ఇమ్యూనిటీకి అవసరమైన దాని కంటే ఎక్కువ స్థాయిలో యాంటీబాడీలు కలిగి ఉన్నారు.  (ప్రపంచానికి పెను సవాలు.. కరోనా)

దీంతో తరచూ కరోనా వైరస్‌ల బారిన పడుతుండటం(కరోనా వైరస్‌ కుటుంబంలో దాదాపు 32 రకాలు ఉన్నాయి. జలుబుకు కారణమైన వైరస్‌ కూడా ఇదే కుటుంబానికి చెందినది. కోవిడ్‌–19 వ్యాధిని కలుగజేసే కరోనా వైరస్‌ మనుషుల్లోకి ప్రవేశించడం వల్లే సమస్య తీవ్రంగా ఉంది) వల్ల వాటి కోసం ఉత్పత్తి అయిన యాంటీబాడీలతో వైరస్‌ నుంచి రక్షణ లభిస్తుండవచ్చునని నిపుణులు అభిప్రాయపడ్డారు. భారత్‌ లాంటి పెద్ద దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో కేసులు, మరణాల సంఖ్య తగ్గుతుండటం.. ఇతర ప్రాంతాల్లో ఇందుకు భిన్నంగా ఉండటం సహజమేనని, అయితే దేశం మొత్తమ్మీద ఏం జరుగుతోందన్నదే ముఖ్యమని వారు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement