Bihar Election: నాడు చారిత్రక ఘట్టాలకు సాక్షి.. నేడు మరో రికార్డుకు‌ బక్సర్‌ సిద్ధం | Buxar’s Historical and Political Significance in Bihar Assembly Elections | Sakshi
Sakshi News home page

Bihar Election: నాడు చారిత్రక ఘట్టాలకు సాక్షి.. నేడు మరో రికార్డుకు‌ బక్సర్‌ సిద్ధం

Oct 12 2025 11:42 AM | Updated on Oct 12 2025 12:44 PM

Bihar Election Buxar History of this key Seat Equation

బీహార్‌లోని బక్సర్‌కు భారతదేశ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. 1757లో ‘బాటిల్ ఆఫ్ బక్సర్’లో విజయమే బ్రిటిషర్లకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటుకు బాటలు వేసింది. అప్పటి బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాకు మీర్ జాఫర్ వెన్నుపోటు పొడవడంతో దేశంలో తెల్లదొరల పాలనకు బీజం పడింది. ఇప్పుడు కూడా బీహార్ దంగల్‌లో బక్సర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బక్సర్‌పై పట్టుకు వివిధ పార్టీలు వ్యూహప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. దీనిపై ‘సాక్షి వెబ్’ ప్రత్యేక కథనం..

బక్సర్ జిల్లాకు మతపరమైన నేపధ్యమే కాకుండా పౌరాణిక, చారిత్రక దృక్కోణాల నుండి కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఈ భూమి భారత చరిత్రలో పలు నిర్ణయాత్మక మలుపులను చూసింది. భారతదేశం అంతటా బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకు ఇక్కడే పునాది పడింది. 1764లో జరిగిన చారిత్రాత్మక బక్సర్ యుద్ధం భారతదేశంలో బ్రిటిష్ పాలనకు మార్గం సుగమం చేసింది. 1539లో జరిగిన చౌసా యుద్ధంలో, షేర్ షా సూరి హుమాయున్‌ను ఓడించి, ఢిల్లీలో అధికారాన్ని స్వాధీనం చేసుకుని, భారత పాలనా విధానాన్ని సమూలంగా మార్చివేశారు. అందుకే బక్సర్.. భారత పాలనను సమూలంగా మార్చిన రెండు యుద్ధాలను చూసిందని చెబుతారు.

భారతీయ పురాణాల కోణం నుండి కూడా బక్సర్‌కు ఎంతో  ప్రాముఖ్యతను ఉంది. ఈ భూమి శ్రీరాముడు విద్యాభ్యాసం చేసిన ప్రదేశం. వామనుడు జన్మించిన భూమి. మహర్షి విశ్వామిత్రుని తపస్సు చేసిన స్థలం. గంగా నది ఒడ్డున ఉన్న ఈ జిల్లా మత విశ్వాసాలకు కేంద్రంగా ఉంది. ఇక్కడ గంగా మాత ఉత్తరాయణి నది ప్రవహిస్తుంది. ఈ జిల్లాకు తూర్పున భోజ్‌పురి ప్రాంతం, దక్షిణాన రోహ్తాస్, ఉత్తరాన గంగా నది, పశ్చిమాన కైమూర్, కర్మనాస నదుల సరిహద్దులు ఉన్నాయి. ఇక్కడి మతపరమైన ప్రదేశాలలో రామరేఖ ఘాట్‌కు  ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడే శ్రీరాముడు  కట్టించిన మొదటి రామేశ్వరనాథ్ ఆలయం ఉంది. శ్రీనాథ్ బాబా ఆలయం, వామనుడి జన్మస్థలం, బాబా బర్మేశ్వర్‌నాథ్ ఆలయం, నౌలఖా ఆలయం, దుమ్రాలోని బిహారీ ఆలయం ఉన్నాయి.

బక్సర్ జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అవి బక్సర్, రాజ్‌పూర్, దుమ్రాన్, బ్రహ్మపూర్. ఈ ప్రాంతాన్ని సాంప్రదాయకంగా బీజేపీకి బలమైన కోటగా పరిగణిస్తారు. అయితే ఇటీవలి ఎన్నికల్లో ఇక్కడి రాజకీయ సమీకరణాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

బక్సర్: 
ఈ స్థానాన్ని గత రెండు దఫాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేత సంజయ్ కుమార్ తివారీ ఆక్రమించారు. బీజేపీ ఆధిపత్యం ఉన్న ఈ ప్రాంతంలో గెలవడం ద్వారా ఆయన తన రాజకీయ పట్టును బలోపేతం చేసుకున్నారు. గత ఎన్నికల్లో ఆయన బీజేపీ రైతు నేత పరశురామ్ చతుర్వేదిని ఓడించారు.

రాజ్‌పూర్ : 
కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ బీజేపీ నేత విశ్వనాథ్ రామ్..జేడీయూ అభ్యర్థి సంతోష్ కుమార్ నిరాలాను ఓడించి, ఈ స్థానాన్ని గెలుచుకున్నారు.

దుమ్రాన్ : 
సీపీఐ (ఎంఎల్)కి చెందిన అజిత్ సింగ్ కుష్వాహా జేడీయుకు చెందిన అంజుమ్ అరాను ఓడించి, ఈ అసెంబ్లీ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

బ్రహ్మపూర్ : 
ఆర్జేడీకి చెందిన శంభు యాదవ్ గత రెండు దఫాల ఎన్నికల్లో ఈ స్థానం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎల్‌జేపీ అభ్యర్థి హులాస్ పాండేను ఓడించారు.

బక్సర్‌లో ప్రధాన సమస్యలివే..
ఈ ప్రాంతంలో అభివృద్ధికి సంబంధించి పలు వినతులున్నాయి. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన సీతా మాత ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే డిమాండ్  చాలాకాలం నుంచి వినిపిస్తోంది. దీనిని రామాయణ సర్క్యూట్‌తో అనుసంధానించాలని కూడా కోరుతున్నారు. అలాగే డుమ్రాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో మలై బ్యారేజ్ ప్రాజెక్టును అమలు చేయాలనే డిమాండ్  కొన్నేళ్లుగా ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement