81 రోజుల తర్వాత.. 50 వేలకు దిగొచ్చిన కరోనా కేసులు | 58419 New Corona Cases Recorded In india | Sakshi
Sakshi News home page

81 రోజుల తర్వాత.. 50 వేలకు దిగొచ్చిన కరోనా కేసులు

Jun 20 2021 10:23 AM | Updated on Jun 20 2021 10:56 AM

58419 New Corona Cases Recorded In india - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. 81 రోజుల తర్వాత కనిష్ట స్థాయిలో కరోనా కేసులు నయోదయ్యాయి.  దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 58,419 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 1,576 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్‌ బారినపడి మొత్తం 3,86,713 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక గత 24 గంటల్లో 87,619 మంది కోవిడ్‌ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,87,66,009 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 7,29,243  కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశంలో 2,98,81,965 మంది కరోనా బారిన పడ్డారు. దేశంలో ఇప్పటివరకు 27.66 కోట్ల మందికిపైగా కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.


చదవండి: కరోనా మృతులకు రూ. 4 లక్షల పరిహారం.. సుప్రీంకోర్టుకు కేంద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement