మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్టు లెక్చరర్ పోస్టుల భర్తీకి ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులే స్వీకరిస్తున్నట్లు ఇన్చార్జి ప్రిన్సిపల్ ముంతాజ్ జహాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, అరబిక్, తెలుగు, కామర్స్, బీఎస్ఐ కంప్యూటర్స్, సైన్స్ అండ్ అప్లికేషన్, అప్లైడ్ న్యూట్రీషన్, బయోటెక్నాలజీ, స్టాటస్టిక్స్, ఫిజిక్స్, జువాలజీ, హెల్త్కేర్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి గలవారు ఈ నెల 28లోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


