ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపైనే ఆశలు.. | - | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపైనే ఆశలు..

Mar 11 2026 8:55 AM | Updated on Mar 11 2026 8:55 AM

పెండింగ్‌ ప్రాజెక్ట్‌లను పూర్తిచేస్తేనే ఉమ్మడి జిల్లాకు పూర్తిస్థాయిలో ప్రయోజనం కలుగనుంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల కింద నార్లాపూర్‌, ఏదుల, కర్వెన, వట్టెం, ఉద్దండాపూర్‌ రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తికావచ్చాయి. పంప్‌హౌజ్‌ల్లో మోటార్ల బిగింపు, కాల్వల తవ్వకాలు కొనసాగుతున్నాయి. నార్లాపూర్‌ నుంచి ఏదుల ప్రధాన కెనాల్‌లో కుడికిళ్ల వద్ద 2.5 కి.మీ. మేర కెనాల్‌ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అలాగే డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌ నిర్మాణం కోసం ఇంకా రూ.50 వేల కోట్లు అవసరం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల పనులు పూర్తి చేసేందుకు భారీస్థాయిలో నిధులు కేటాయించాల్సి ఉండగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపైనే ఉమ్మడి జిల్లావాసులు ఆశలు పెట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement