
ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు
వనపర్తి విద్యావిభాగం: తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ 2025–26 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య బుధవార ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కోల్పోకుండా అర్హత గల వారిని చేర్చుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ను ఆదేశించారు.
బీఫార్మసీ ఫలితాలు విడుదల
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలోని బీఫార్మసీ సెమిస్టర్–8 రెగ్యులర్, 1, 3, 5, 7 సెమిస్టర్లకు సంబంధించి బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను వీసీ శ్రీనివాస్ బుధవారం విడుదల చేశారు. ఈ మేరకు 8వ సెమిస్టర్లో 82.74 శాతం, 7వ సెమిస్టర్లో 71.43 శాతం, 5వ సెమిస్టర్లో 50 శాతం, 3వ సెమిస్టర్లో 54.55 శాతం, 1వ సెమిస్టర్లో 58.33 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్బాబు, కంట్రోలర్ ప్రవీణ, అడిషనల్ కంట్రోలర్ శాంతిప్రియ, ప్రిన్సిపాల్ రవికాంత్, ఈశ్వర్కుమార్, సురేష్, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.