దొర్నిపాడు: పేదరిక నిర్మూలన లక్ష్యంగా పీ4 కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ శ్రీధర్రెడ్డి సూచించా రు. శుక్రవారం స్థానిక వెలుగు కార్యాలయంలో జీరో పావర్టీపై గ్రామైక్య సంఘాల మహిళలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, నిరుపేదలను ఎలా గుర్తించాలో వివరిస్తూ 16 సూచికలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా గ్రామైక్య సంఘాలు దీని దృష్టిసారించాలన్నారు. అందరూ గౌరవప్రదమైన జీవితాన్ని గడపడమే దీని ముఖ్య ఉద్దేశం అన్నారు. కార్యక్రమంలో వెలుగు ఏపీఎం బాబు, సీసీలు తదితరులు పాల్గొన్నారు.


