ఏప్రిల్ నెలలో ఆరు ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేశా. ఎకరాకు రూ.13వేలు పెట్టి విత్తనాలు తీసుకువచ్చి విత్తా. మొదట్లో పంట ఏపుగా రావడంతో ఖర్చు పెట్టి పంటను కాపాడుకున్నా. మే నెల చివర్లోనే నీరు పూర్తిగా ఇంకిపోయింది. పంట కాపాడుకునేందుకు బోర్లు వేయించినా నీరు పడలేదు. వర్షాలు రాకపోవడంతో పంట ఎండిపోతుంది. పశువుల మేతకై నా వస్తుందని తొలగిస్తున్నా. ఆరు ఎకరాల్లో రూ. 3 లక్షల వరకు నష్టపోయా.
– గోంగళ్ల నాగమద్దయ్య, రైతు చుంచుఎర్రగుడి
మూడు ఎకరాల్లో ముందస్తు సాగు కింద వేరుశనగ సాగు చేశా. విత్తనాలు, ఎరువులు, కూలీలు, సేద్యపు ఖర్చుల కింద రూ.1.30 లక్షల ఖర్చు చేశా. జూన్ నెల పడకపోయినా జూలై పడుతుందేమోనని చూశా. కానీ వర్షం కురువకపోగా వేడిగాలులు వీస్తుండటంతో పశువుల మేతకై నా వస్తుందని పంటను తొలగిస్తున్నా.
– బేతాల జనార్దన్, రైతు చుంచుఎర్రగుడి


