30న పత్తికొండకు సీఎం వైఎస్‌ జగన్‌ | - | Sakshi
Sakshi News home page

30న పత్తికొండకు సీఎం వైఎస్‌ జగన్‌

May 23 2023 1:22 AM | Updated on May 23 2023 11:12 AM

- - Sakshi

కర్నూలు(సెంట్రల్‌): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 30వ తేదీన కర్నూలు జిల్లా పత్తికొండకు రానున్నారని కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన తెలిపారు. పత్తికొండలో నిర్వహిస్తున్న వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొంటారన్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుసగా ఐదో ఏడాది వైఎస్‌ఆర్‌ రైతు భరోసా మొదటి విడతను ఆ రోజు సీఎం అన్నదాతల ఖాతాలో జమ చేస్తారన్నారు. కాగా, సీఎం సభను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement