ముక్కోటి ఏకాదశికి ‘మట్టపల్లి’ సిద్ధం | - | Sakshi
Sakshi News home page

ముక్కోటి ఏకాదశికి ‘మట్టపల్లి’ సిద్ధం

Dec 27 2025 6:55 AM | Updated on Dec 27 2025 6:55 AM

ముక్కోటి ఏకాదశికి ‘మట్టపల్లి’ సిద్ధం

ముక్కోటి ఏకాదశికి ‘మట్టపల్లి’ సిద్ధం

ముక్కోటి ఏకాదశికి ‘మట్టపల్లి’ సిద్ధం

మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 29, 30తేదీల్లో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు నిర్వహించనున్నారు. అందుకోసం ఆలయ పాలకవర్గం ఏర్పాట్లు పూర్తి చేసింది. 29 సాయంత్రం 5 గంటలకు మంగళవాయిద్యం, వేదమంత్రపఠనం, శాసీ్త్రయ సంగీత కచేరీతో ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. రాత్రి 8 గంటలకు భక్త రామదాసు హరికథ, లక్ష్మీనృసింహనామ ససంకీర్తనం నిర్వహించనున్నారు. 30వ తేదీ తెల్లవారుజామున స్వామివారి వైకుంఠ(ఉత్తర) ద్వార దర్శనం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు ఆలయంలో లక్షారేపత్రి పూజ, గ్రామోత్సవం, స్వామి వారి ఆలయ ప్రవేశం, రాత్రి 8 గంటలకు మట్టపల్లి క్షేత్ర మహత్యం బుర్రకథ ఉంటుందని కమిటీ ఆలయ చైర్మన్‌ చెన్నూరు మట్టపల్లిరావు తెలిపారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం తాగునీరు, ప్రసాదాలు, దైవదర్శనానికి క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement