అమ్రాబాద్: కేసుల నమోదు, పరిష్కారంలో పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండొద్దని ఎస్పీ సంగ్రామ్సింగ్ జిపాటిల్ ఆదేశించారు. అమ్రాబాద్ పోలీస్స్టేషన్ను శుక్రవారం డీఎస్పీ పల్లె శ్రీనివాసులు తో కలిసి ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఎస్పీకి గౌరవ వందనం చేశారు. అనంతరం ఎస్పీ పోలీస్స్టేషన్ పరిసరాలు తిరిగి పరిశీలించారు. కేసుల నమోదు, క్రైమ్ రికార్డులు పరిశీలించిన అనంతరం పోలీస్స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ, సిబ్బందికి సూచించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ క్రైమ్రేట్ తగ్గించాలన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ చంద్రయ్య, ఎస్ఐ హన్మంత్రెడ్డి ఉన్నారు.


