రామప్ప ఆలయ ఆవరణలోని కామేశ్వరాలయాన్ని పునర్నిర్మాణం పేరుతో 2011లో పురావస్తుశాఖ అధికారులు తొలగించారు. తొలగించిన శిల్పాలను రామప్ప గార్డెన్లో పెట్టడంతో శిల్పాలు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ శిల్పకళా సౌందర్యాన్ని కోల్పోతున్నాయి. 2022 డిసెంబర్లోగా కామేశ్వరాలయాన్ని పునరుద్ధరించాలని హెరిటేజ్ కమిటీ షరతు విధించినప్పటికీ ఇప్పటివరకు ఆలయ నిర్మాణ పనులు పునాదులకే పరిమితమయ్యాయి. 2026 జూన్లోగా పూర్తి చేస్తామని కేంద్ర పురావస్తుశాఖ అధికారులు గడువు తీసుకొని 2025 మార్చి మాసంలో పనులు ప్రారంభించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటివరకు ముందుకు సాగలేదు.


