సుప్రియ, మంజునాథ్ రెడ్డి
తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన సినిమా ‘రిచ్ కిడ్’. మంజునాథ్ రెడ్డి, సుప్రియ మార్ల హీరో హీరోయిన్లుగా నటించారు. శ్రీ మంజునాధ సినిమాస్ బ్యానర్ పై జి. మంజునాథ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది.
షఫీ ఉల్లాహ్, అనిల్ దేరంగుల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘‘తండ్రీకొడుకుల ఎమోషన్స్, హాస్యం, మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’ అని యూనిట్ పేర్కొంది.


