నాన్న ఎప్పుడూ ఆ మాటలు చెప్తుంటాడు: నిహారిక

Niharika Konidela participates in Green India Challenge - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్‌లోని జీహెచ్‌ఎంసీ పార్కులో సోమవారం నటి నిహారికా కొణిదెల మొక్కలు నాటారు. తన తండ్రి నాగబాబు ఎప్పుడూ ప్రకృతిని ప్రేమించాలని, మొక్కలను పెంచాలని చెబుతుంటారని ఈ ప్రపంచంలో అందరినీ కాపాడే మొదటి దేవుడు ప్రకృతి అని ఆ ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు.

ఎంపీ సంతోష్‌ కుమార్‌ ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తూ ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తూ మొక్కలు నాటించడం అభినందనీయం అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. 

చదవండి: (NIMS Director: అనారోగ్యంతో అపోలోకు.. ఆరోగ్యంగా నిమ్స్‌కు..!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top