ఇండియన్ యానిమేషన్ సినిమా ‘మహావతార్ నరసింహా’ బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో యానిమేషన్ చిత్రాల మేకింగ్పై కొందరు దర్శక–నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’, ‘వాయుపుత్ర’ వంటి సినిమాల ప్రకటనలు వచ్చాయి. తాజాగా యానిమేషన్ సినిమా ‘హనుమత్ సుందరకాండ’ ప్రకటన వచ్చింది.
‘ఫ్రమ్ ది ఎటర్నల్ రామాయణ’ అనేది క్యాప్షన్. ఈ 3డీ యానిమేషన్ సినిమాని అరుణ్కుమార్ రాపోలు దర్శకత్వంలో నిశ్చిత సేతు, హరినాథ్ దేవర నిర్మిస్తున్నారు. హాలీవుడ్ సినిమాల్లో వినియోగించే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీని ఈ ‘హనుమత్ సుందరకాండ’ చిత్రానికి ఉపయోగిస్తున్నట్లుగా యూనిట్ పేర్కొంది. యానిమేషన్ సినిమాల్లోని పాత్రల హావభావాలు, కదలికలు స్క్రీన్పై రియలిస్టిక్గా కనిపించేందుకు ఈ సాంకేతికతను ఫిల్మ్ మేకర్స్ వినియోగిస్తుంటారు.


