అఫీషియల్ ప్రకటన.. ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ | Mirzaput Actor Latest Crime Thriller Series Coming On This OTT | Sakshi
Sakshi News home page

Crime Thriller: మీర్జాపూర్‌ నటుడి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌.. ఓటీటీ అఫీషియల్ ప్రకటన

Aug 18 2025 3:47 PM | Updated on Aug 18 2025 3:59 PM

Mirzaput Actor Latest Crime Thriller Series Coming On This OTT

ఓటీటీలు వచ్చాక సరికొత్త సినిమాలు, సిరీస్‌లు సినీ ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ అందిస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా క్రైమ్ జోనర్‌లో వచ్చే సిరీస్‌లకు ఓటీటీలో విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఇప్పటికే ఆ జోనర్‌లో వచ్చిన చిత్రాలు, సిరీస్‌లు చాలా వరకు సూపర్ హిట్‌గా నిలిచాయి.

తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్‌ మిమ్మల్ని అలరించేందుకు వస్తోంది. మీర్జాపూర్ నటుడు అలీ ఫజల్ లీడ్‌ రోల్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌  వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

రాఖ్‌ (Raakh) పేరుతో ఈ ఆసక్తికర వెబ్ సిరీస్‌ను ప్రొసిత్‌ రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. గతంలో పాతాళ్ లోక్‌ అనే వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ క్రైమ్ థ్రిల్లర్‌ వచ్చే ఏడాది ప్రేక్షకులను అలరించనుంది. ఈ ఆసక్తికర వెబ్ సిరీస్‌లో సోనాలి బింద్రే, ఆమిర్‌ బషీర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌ను అనూష నందకుమార్‌, సందీప్‌ సాకేత్‌ నిర్మిస్తున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement