
కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సమ్మతమే’. కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్లో శుక్రవారం (జూన్ 24) విడుదలవుతోంది.
Minister Talasani Srinivas Speech At Sammathame Pre Release Event: ‘తెలుగు చిత్ర పరిశ్రమ సత్తా ఈరోజు విశ్వవ్యాప్తం అయింది. ఇండస్ట్రీలో చాలామంది అవకాశాలు లేవు అంటున్నారు.. కానీ, ప్రతిభ ఉంటే ఇంటి వద్ద ఉన్నా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ‘సమ్మతమే’ సినిమా హిట్ కావాలి.. సక్సెస్ మీట్లో కలుద్దాం’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సమ్మతమే’. కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్లో శుక్రవారం (జూన్ 24) విడుదలవుతోంది.
ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘సమ్మతమే’ ట్రైలర్ చూసినప్పుడు సినిమాలో విషయం ఉందనిపించింది. యంగ్ టీమ్ కలిసి ధైర్యంగా తీసిన ఈ సినిమా ఘనవిజయం సాధించాలి’’ అన్నారు. ‘‘సమ్మతమే’ని గీతా ఆర్ట్స్లో రిలీజ్ చేయడానికి ముఖ్య కారణం కిరణ్. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలి’’ అన్నారు అల్లు అరవింద్. ‘‘సమ్మతమే’ సినిమా నా ఒక్కరిదే కాదు.. ఇక్కడికొచ్చిన మీ అందరిదీ. ఈ చిత్రాన్ని హిట్ చేయాలి’’ అన్నారు కంకణాల ప్రవీణ. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, గాదరి కిషోర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నిర్మాత ‘బన్నీ’ వాసు తదితరులు పాల్గొన్నారు.
చదవండి: 'పుష్ప 2'లో శ్రీవల్లి చనిపోతుందా ? నిర్మాత క్లారిటీ !
నేను జీరో.. ఏదో ఒకరోజు ఆ స్థాయికి వెళ్తా: ఆకాష్ పూరి
ఓటీటీలోనూ రికార్డులు క్రియేట్ చేస్తున్న 'ఆర్ఆర్ఆర్'..