Manchu Vishnu: మంచు విష్ణు చేతుల మీదుగా ‘నీ చిత్రం చూసి’ టీజర్‌

Manchu Vishnu Released Nee Chitram Choosi Movie Teaser - Sakshi

మురళి, శివానీ నాయుడు జంటగా మహీంద్రా బషీర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీ చిత్రం చూసి’. మురళీ మోహన్‌.కె నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ‘‘అందమైన ప్రేమకథా చిత్రమిది.

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు విడుదల చేసిన మా చిత్రం టీజర్‌కి, ఏపీ మాజీ మంత్రి గడ్డం వినోద్‌ వెంకటస్వామి ఆవిష్కరించిన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వస్తోంది. త్వరలో మా సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు దర్శక-నిర్మాతలు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top