SUN TV Network Announced Evaru Meelo Koteeswarulu On Gemini TV - Sakshi
Sakshi News home page

ఎవరు మీలో కోటీశ్వరులు? త్వరలో జెమినీ టీవీలో

Mar 7 2021 3:54 PM | Updated on Mar 7 2021 4:45 PM

Gemini TV Announce Evaru Meelo Koteeswarulu - Sakshi

సామాన్యుల జీవితాలను మార్చే గేమ్‌ షో, మీ ఆశలను నిజం చేసేందుకు జెమిని టీవీలో రాబోతోంది..

మెరుపు తీగలా వచ్చిపోయే షోలు కొన్నైతే ప్రేక్షకుల మదిలో ముద్రించుకుపోయే షోలు మరికొన్ని. మీలో ఎవరు కోటీశ్వరుడు కూడా ఇదే కోవలోకి చెందుతుంది. ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో విజయవంతమైన ఈ షో హిందీలో కౌన్‌ బనేగా కరోడ్‌పతిగా ప్రసారమవుతోంది. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో అక్కడ సూపర్‌ సక్సెస్‌ సాధించింది. దీంతో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో దీన్ని తెలుగులోకి తీసుకొచ్చారు. టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షో ఇక్కడ కూడా విజయవంతమైంది.

తాజాగా మరో కొత్త సీజన్‌ను ప్రారంభింబోతున్నారు. కాకపోతే ఈసారి జెమిని టీవీ షో పేరును కొంత మార్చి ఎవరు మీలో కోటీశ్వరులుతో ముందుకు వస్తోంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమోను రిలీజ్‌ చేసింది. 'సామాన్యుల జీవితాలను మార్చే గేమ్‌ షో, మీ ఆశలను నిజం చేసేందుకు జెమిని టీవీలో రాబోతోంది..' అంటూ వీడియో వదిలింది. కాగా ఈ సీజన్‌కు యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా రాబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఆయన రంగంలోకి దిగితే టీఆర్పీలు ఆకాశాన్ని అంటడం ఖాయమని చెప్తున్నారు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌. ఈ షో ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: రానా: త్వరలోనే సీజన్‌-3 ప్రారంభం

Advertisement
 
Advertisement
Advertisement