తల్లిదండ్రులకు అంకితం

Doctorate to writer Sai Madhav Burra - Sakshi

సినీ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌ డాక్టరేట్‌ అందుకున్నారు. సినీరంగంలో రచయితగా తన ప్రస్థానాన్ని గుర్తించిన కాలిఫోర్నియాకు చెందిన ‘న్యూలైఫ్‌ థియొలాజికల్‌ యూనివర్సిటీ’ వారు డాక్టరేట్‌ అందించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బుధవారం జరిగిన కార్యక్రమంలో సాయిమాధవ్‌ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. ‘ఈ పురస్కారాన్ని నా తల్లిదండ్రులకు అంకితమిస్తున్నాను’ అన్నారాయన. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని ఆయన్ను అభినందించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top