
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్ సరసన కనిపించనుంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న స్పోర్ట్స్ ఓరియంటెడ్ డ్రామాలో దేవర భామ నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. జూనియర్ సరసన దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఏకంగా గ్లోబల్ స్టార్తో ఛాన్స్ కొట్టేసింది.
ఇక సినిమాల సంగతి పక్కనపెడితే జాన్వీ కపూర్ ప్రస్తుతం లండన్లో చిల్ అవుతోంది. తన సిస్టర్ ఖుషీ కపూర్తో పాటు వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. దీనిక సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అయితే వీరితో పాటు ఆమె బాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న శిఖర్ పహారియా కూడా ఉన్నారు. ఒకరినొకరు చేయి పట్టుకుని సరదాగా కనిపించారు. ఈ వీడియోలో వీరిద్దరు చాలా సన్నిహితంగా ఉన్నారు. ఈ ప్రేమ జంటను చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.