కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికి శ్రీ నల్లపోచమ్మ దేవి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. పలు జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి కుంకుమార్చన చేసి, ఒడిబియ్యం పోసి, బోనాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. పలువురు భక్తులు తలనీలాలు సమర్పించి, వాహాన పూజలు జరిపించారు.
»
»


