పోటెత్తిన మంజీర | - | Sakshi
Sakshi News home page

పోటెత్తిన మంజీర

Aug 15 2025 11:31 AM | Updated on Aug 15 2025 11:31 AM

పోటెత్తిన మంజీర

పోటెత్తిన మంజీర

● పొంగిపొర్లుతున్న ఘనపురం ● సింగూరు నుంచి 5 వేల క్యూసెక్కులు విడుదల ● వన దుర్గమ్మ ఆలయం మూసివేత ● పరిస్థితిని సమీక్షించిన ఆర్డీఓ రమాదేవి

● పొంగిపొర్లుతున్న ఘనపురం ● సింగూరు నుంచి 5 వేల క్యూసెక్కులు విడుదల ● వన దుర్గమ్మ ఆలయం మూసివేత ● పరిస్థితిని సమీక్షించిన ఆర్డీఓ రమాదేవి

పాపన్నపేట(మెదక్‌): మంజీర నది పోటెత్తింది. ఘనపురం ఆనకట్ట పొంగిపొర్లుతుంది. సింగూరు ప్రాజెక్టు నుంచి 5 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో గురువారం మంజీర పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుండటంతో ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఆలయాన్ని మూసివేశారు. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి పూజలు చేస్తున్నారు. మెదక్‌ ఆర్డీఓ రమాదేవి, పాపన్నపేట తహసీల్దార్‌ సతీశ్‌, ఎస్సై శ్రీనివాస్‌గౌడ్‌, ఆలయ సిబ్బందితో కలిసి ఘనపురం ఆనకట్ట, ఆలయం ఎదుట వరద పరిస్థితిని సమీక్షించారు. నది వైపు భక్తులెవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఘనపురం ప్రాజెక్టు నుంచి మహబూబ్‌నహర్‌, ఫతేనహర్‌ కెనాల్‌లకు నీరు విడుదల చేస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలు, మత్స్యకారులు మంజీర నది వైపు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

కొల్చారం: ఘనపురం ఆనకట్ట మీదుగా ప్రవహిస్తున్న మంజీరా

ఆలయాన్ని మూసి వేస్తున్న సిబ్బంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement