
అట్టహాసంగా ధ్వజస్తంభ ఊరేగింపు
పెద్దశంకరంపేట(మెదక్): సీతారాముల ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ధ్వజస్తంభం ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరుమలాపూర్ హనుమాన్ ఆలయం వద్ద ధ్వజ స్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళల నృత్యాలు, మంగళ హారతులు, కేరళ వాయిద్యాలు, డాక్టర్ ఐశ్వర్యరెడ్డి అధ్వర్యంలో సాయితుంబుర వారి కూచిపూడి నృత్యాలు, భారీ హనుమాన్ విగ్రహ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈనెల 21వ తేదీ నుంచి 23 వరకు నూతన ఆలయ ప్రారంభం, విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.