
రైతులకు అండగా కాంగ్రెస్
ప్యాడీ క్లీనర్తో ధాన్యం శుభ్రం చేయాలి
కలెక్టర్ రాహుల్రాజ్
హవేళిఘణాపూర్(మెదక్): రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని శుభ్రం చేసిన తర్వాత విక్రయిస్తే మద్దతు ధర లభిస్తుందని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. గురువారం మెదక్ మండలం పాతూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు ప్యాడీ క్లీనర్తో ధాన్యం శుభ్రం చేయకపోవడం వల్ల రెండు, మూడు కిలోల తరుగుపోతుందన్నారు. రైతులు పంటలు కోసిన వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. చివరి గింజ వరకు కొనుగోలు చేసే విధంగా చూడాలన్నారు. జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 480 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన ప్యాడీ క్లీనర్లను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. తేమ శాతం 17 ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్కు రూ. 2,320, సాధారణ రకానికి రూ. 2,300 నిర్ణయించినందని వెల్లడించారు. జిల్లాలోని రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, దళారులకు ధాన్యం విక్రయించవద్దని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, తహసీల్దార్ లక్ష్మణ్బాబు తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి/జోగిపేట(అందోల్) : రైతులకు అండగా ఉండేది, వ్యవసాయాన్ని పండగగా మా ర్చింది కాంగ్రెస్ పార్టీయేనని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. జోగిపేట్ డివిజన్లో గురువారం జరిగిన ఆత్మ కమిటీ ప్రమాణస్వీకారానికి మంత్రి హాజరై చైర్మన్ తిమ్మారెడ్డి గారి మల్లారెడ్డి తో పాటు 23 మంది డైరెక్టర్లను అభినందించారు. అంతకుముందు జోగిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో అందోల్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత శ్రీ జోగినాథ స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా జరిగిన శివ పార్వతుల కల్యాణోత్సవానికి హాజరయ్యారు. ఆలయ పూజారులు మంత్రికి పూర్ణ కుంభంతో స్వా గతం పలికారు. అనంతరం ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సింగూరు లిఫ్టు ప్రాజెక్టు శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నామ న్నారు. అందులో భాగంగానే రూ.170 కోట్లతో సీసీ లైనింగ్ పనులను చేపడుతున్నట్లు వివరించారు.
మంత్రి దామోదర రాజనర్సింహ

రైతులకు అండగా కాంగ్రెస్