చెన్నూర్: చెన్నూర్ మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల కళాశాల ఫస్టియర్ విద్యార్థి సాత్విక్ రాష్ట్రస్థాయి క్రీడల్లో రాణిస్తున్నాడు. ఖమ్మంలో నిర్వహించిన ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించాడు. ఝార్ఖండ్లోని రాంచిలో నిర్వహంచిన పోటీల్లో పాల్గొని తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఈ నెల 7, 8 తేదీల్లో హన్మకొండలో జరిగిన యూత్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి డిస్క్త్రో పోటీలో పాల్గొని మూడోస్థానం సాధించాడు. ఇటీవల హన్మకొండలోని జేఎన్ఎస్ గ్రౌండ్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సౌత్జోన్ పోటీల్లో మూడో స్థానంలో నిలిచాడు. పాఠశాల పీడీ విజయ్కుమార్ నేతృత్వంలో బంగారు పతకం సాధించడమే తన లక్ష్యమని సాత్విక్ తెలిపాడు.


