దండేపల్లి: జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రి(రైతు నమోదు) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు 74శాతం మాత్రమే పూర్తయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పీఎం కిసాన్, రైతుభరోసా, బోనస్, రాయితీ పరికరాలు, ఎరువులు, పంటల బీమా, బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. రైతులకు అవగాహన సదస్సులు కూడా నిర్వహించారు. కొందరు రైతులకు అవగాహన లేకపోవడం, మరికొందరు ఇతర ప్రాంతాల్లో ఉండడం వంటి కారణాలతో ఫార్మర్ రిజిస్ట్రి నిదానంగా సాగుతోంది.
సాగుభూమి ఉన్న ప్రతీ రైతుకు..
రైతు నమోదు ప్రక్రియ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏడాది కొనసాగుతోంది. ఏఈవోలు రైతువేదికలతోపాటు వ్యవసాయ కార్యాలయాల్లో, కొన్ని చోట్ల గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉండి రైతు నమోదు ప్రక్రియ చేపడుతున్నారు. సాగుభూమి ఉన్న ప్రతీ రైతుకు 11అంకెల రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య రూపొందిస్తారు. ఈ ఐడీలో ఆధార్, ఫోన్నంబర్లు, రైతు పేరు, పట్టాదారు పాస్పుస్తకం వివరాలు, పొలం సర్వే నంబర్లు, సాగు వివరాలు, భూమి రకం, రైతులు పొందే రాయితీ, రుణాలు, పంటల బీమా వివరాలు పొందుపరుస్తారు. ఈ ప్రక్రియ మీ సేవ కేంద్రాల్లో కూడా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
తప్పనిసరిగా చేసుకోవాలి..
ఫార్మర్ రిజిస్ట్రి ఇప్పటికీ చేయించుకోవాని వారుంటే తప్పనిసరిగా చేసుకోవాలి. వ్యవసాయ విస్తరణ అధికారుల వద్దకు వెళ్లి చేయించుకోవాలి. లేదంటే మీసేవా కేంద్రాల్లోనూ చేసుకోవచ్చు. ఫార్మర్ రిజిస్ట్రి చేయించుకుంటే భవిష్యత్లో మంచి ఉపయోగం ఉంటుంది.
– సురేఖ, జిల్లా వ్యవసాయ అధికారి
జిల్లాలోని మండలాల
వారీగా రిజిస్ట్రి వివరాలు
మండలం రైతులు పూర్తయిన చేయించు
వారు కోనివారు
దండేపల్లి 17,439 14,536 2,903
లక్సెట్టిపేట 14,325 11,563 2,762
జన్నారం 15,544 12,501 3,043
భీమిని 8,081 6,351 1,730
మంచిర్యాల 1,096 847 249
కన్నెపల్లి 8,958 6,887 2,071
కాసిపేట 5,710 4,345 1,365
నెన్నెల 9,192 6,753 2,439
హాజీపూర్ 9,975 7,248 2,727
బెల్లంపల్లి 6,212 4,505 1,707
కోటపల్లి 13,375 9,583 3,792
భీమారం 5,691 4,033 1,658
చెన్నూర్ 1,6315 11,551 4,764
తాండూర్ 8,282 5,855 2,427
మందమర్రి 6,318 4,318 2,000
వేమనపల్లి 7,301 4,955 2,346
జైపూర్ 16,693 10,627 6,066
మొత్తం 1,70,507 1,26,458 44,049


