మందిపల్లిపాతతండాకు చెందిన 13 ఏళ్ల సీతామహాలక్ష్మి ధన్వాడలో 9వ తరగతి చదువుతోంది. చిన్న వయసులోనే రెజ్లింగ్ బరిలో అడుగుపెట్టి రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటోంది. 2025లో ఉత్తరప్రదేశ్లో జరిగిన అండర్–14 ఎస్జీఎఫ్ఐ నేషనల్స్, ఈ ఏడాది తమిళనాడులో జరిగిన అండర్–15 నేషనల్స్లో పాల్గొంది. న్యూఢిల్లీలో జరిగిన అండర్–14 ఎస్జీఎఫ్ జాతీయ పోటీల్లో కాంస్య పతకం సాధించి తన సత్తా చాటింది. నిరంతర శిక్షణతో మరింత ఉన్నత స్థాయికి చేరుకుని స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని సీతామహాలక్ష్మి చెబుతోంది.


