చికర్లగడ్డతండాకు చెందిన ప్రియమణి ధన్వాడ కేజీబీవీలో ఇంటర్ చదువుతోంది. కొన్నేళ్లుగా రెజ్లింగ్లో శిక్షణ పొందుతున్న ఆమె జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించింది. 2025లో మహారాష్ట్రలో జరిగిన అండర్–15 నేషనల్స్, ఉత్తరప్రదేశ్లో జరిగిన అండర్–17 ఎస్జీఎఫ్ఐ నేషనల్స్లో పాల్గొంది. ఈ ఏడాది మహారాష్ట్రలో జరిగిన సబ్ జూనియర్ నేషనల్స్లోనూ రాష్ట్ర జట్టు తరఫున బరిలోకి దిగింది. రెజ్లింగ్లో మరింత రాణించి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని ప్రియమణి చెబుతోంది.
రెజ్లింగ్ ప్రాక్టీస్ చేస్తున్న బాలికలు


